Header Banner

అమెరికా బోర్డర్లో పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతున్న భారతీయ తల్లితండ్రులు! కారణం ఏమిటంటే!

  Tue Apr 29, 2025 15:58        U S A

అమెరికాలో ఓవైపు భారతీయ అక్రమ వలసల్ని స్వదేశాలకు పంపుతున్నారు. మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్ధుల్ని కూడా ఎక్కడ దొరికినా బహిష్కరించేందుకు ట్రంప్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అమెరికా సరిహద్దుల్లో భారతీయ మైనర్లు పట్టుబడుతున్న ఘటనలు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. వివిధ కారణాలతో వీరు తల్లితండ్రులు, ఇతరుల తోడు లేకుండా ఒంటరిగా పట్టుబడుతున్నారు.

 

 

అమెరికాలోని మెక్సికో, కెనడా సరిహద్దుల్లో 6 నుండి 17 సంవత్సరాల వయస్సు గల భారతీయ పిల్లలు ఒంటరిగా కనిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పిల్లలు తరచుగా ఒంటరిగా, భయంతో, వారి తల్లిదండ్రులను సంప్రదించే సమాచారాన్ని కలిగి ఉన్న కాగితం ముక్కతో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా -మెక్సికో సరిహద్దు వద్ద చాలా మంది మైనర్లు వ్యూహాత్మకంగా వదిలివేయబడినట్లు అధికారులు గుర్తించారు. అయితే కెనడా సరిహద్దుల్లో మాత్రం వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం అక్కడి సరిహద్దుల్లో కఠిన పరిస్దితులే.

 

అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 77 మంది ఇలా ఒంటరిగా కనిపించిన భారతీయ మైనర్లను అరెస్టు చేశారు. మెక్సికో సరిహద్దు వద్ద 53 మంది, కెనడా సరిహద్దు వద్ద 22 మంది, మరికొందరిని అమెరికాలో గుర్తించారు. 2022లో ఇలా 409 భారతీయ మైనర్లు దొరికారు. 2023లో ఈ సంఖ్య 730కి చేరింది. 2024 నాటికి మాత్రం 517 మందికి తగ్గింది. 2025లో ఇప్పటివరకూ 77 మంది మైనర్లు ఇలా దొరికారట. 2020లో కరోనా సమయంలో మాత్రం 219 మంది ఇలా దొరికారట.

ఇది కూడా చదవండి: వివేక హత్య కేసులో బిగ్ షాక్! విచారణలో కీలక మలుపు!

 

2021లోనూ కేవలం 237 మంది మైనర్లు ఇలా పట్టుబడ్డారు. కోవిడ్ తర్వాత అక్రమ వలసలు పెరగడంతో ఇలా దొరికే మైనర్ల సంఖ్య కూడా పెరుగుతోందని గుర్తించారు. మైనర్లకు అనుకూలంగా ఉండే చట్టపరమైన లొసుగుల ద్వారా అమెరికా నివాసాన్ని పొందే అవకాశాలను మెరుగుపరచడానికి కుటుంబాలు ఉద్దేశపూర్వకంగా పిల్లలను ఒంటరిగా పంపుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అమెరికాలో అక్రమంగా చొరబడే సమయంలో పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇలా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు.


ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi The reason for Indian parents leaving their children on the US border is that